MLAs Fight in Assembly: బంగాల్ అసెంబ్లీ రణక్షేత్రాన్ని తలపించింది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష భాజపా ఎమ్మెల్యేలు సభలోనే బాహాబాహీకి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారణంగా ఉందని బీర్భూమ్ ఘటనను ప్రస్తావిస్తూ భాజపా ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం గొడవకు కారణమైంది. ఇరు పార్టీల ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో సభలో కాసేపు యుద్ధ వాతావరణం నెలకొంది. అనంతరం సభ నుంచి ప్రతిపక్షనేత సువేందు అధికారి సహా ఐదుగురు భాజపా ఎమ్మెల్యేnను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. తదుపరి నోటీసు వచ్చే వరకు వారికి సభలో అనుమతి లేదని పేర్కొన్నారు.
అసెంబ్లీలో అధికార పార్టీ, భాజపా ఎమ్మెల్యేల బాహాబాహీ - బంగాల్ వార్తలు
West Bengal Assembly బంగాల్ అసెంబ్లీలో అధికార టీఎంసీ, భాజపా ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. దీంతో సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. అనంతరం ఐదుగురు భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

TMC BJP MLAs fight: భాజపా ఎమ్మెల్యేలు మాత్రం టీఎంసీ నేతలు కావాలనే తమపై దాడికి దిగారని ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలకు రక్షణ లేకపోవడం దారుణమని ఆ పార్టీ నేత సువేందు అధికారి అన్నారు. సీఎం మమతా బెనర్జీని శాంతి భద్రతల విషయంపై ప్రశ్నించినందుకే ఇలా చేశారని మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన 8-10 మంది ఎమ్మెల్యేలను టీఎంసీ నాయకులు కొట్టారని పేర్కొన్నారు. అయితే టీఎంసీ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. అసెంబ్లీలో ఉద్రిక్తతలు సృష్టించేందుకే భాజపా నేతలు డ్రామాలు ఆడుతున్నారని టీఎంసీ నేత, మంత్రి ఫిర్హాద్ హకీమ్ ఆరోపించారు. కమలం పార్టీ నేతలే దాడి చేశారని, తమ ఎమ్మెల్యేలు కొంతమంది గాయపడ్డారని చెప్పారు.
భాజపా తరఫున ప్రచారం.. ముస్లిం యువకుడ్ని కొట్టి చంపిన స్థానికులు