తెలంగాణ

telangana

టీకా ఉత్సవ్​: 3 రాష్ట్రాల్లో కోటి మందికి టీకాలు

By

Published : Apr 15, 2021, 4:35 PM IST

దేశవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయడం కోసం కేంద్రం.. ఏప్రిల్​11నుంచి14 వరకు టీకా ఉత్సవ్​ను ప్రారంభించింది. ఇందులో భాగంగా కేవలం మూడు రాష్ట్రాలలో కలిపి కోటి మందికి కరోనా టీకాల్ని పంపిణీ చేశారు.

vaccinations
కరోనా టీకా

టీకా ఉత్సవ్​ కార్యక్రమంలో భాగంగా మూడు రాష్ట్రాల్లో కోటి మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో.. మహారాష్ట్ర, రాజస్థాన్​, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాలు కలిసి కోటికి పైగా డోసులను అందించాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.

దేశవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కరోనా టీకా వేయడం కోసం ప్రధాని మోదీ.. టీకా ఉత్సవ్​ను ఏప్రిల్11న ప్రారంభించారు. ఏప్రిల్​ 14వరకు ఈ కార్యక్రమం జరిగింది. కాగా దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్​లో 1,28,98,314 డోసుల్ని పంపిణీ చేశారు.

'టీకా ఉత్సవ్​' కార్యక్రమంలో వేసిన డోసుల సంఖ్య..

తేది టీకా డోసులు
ఏప్రిల్​-11 29,33,418
ఏప్రిల్​-12 40,04,521
ఏప్రిల్​-13 26,46,528
ఏప్రిల్​-14 33,13,848

మూడు రాష్ట్రాలలో ఇప్పటివరకు వేసిన డోసులు

రాష్ట్రం టీకా డోసులు
మహారాష్ట్ర 1,11,19,018
రాజస్థాన్​ 1,02,15,471
ఉత్తర్​ప్రదేశ్​ 1,00,17,650

ఇదీ చదవండి:కరోనా కొత్త స్ట్రెయిన్ లక్షణాలేంటి?

ABOUT THE AUTHOR

...view details