తెలంగాణ

telangana

By

Published : Feb 7, 2021, 7:02 PM IST

ETV Bharat / bharat

వైరల్​: పార్కులో పులి పిల్లల సరదా ఆటలు

మధ్యప్రదేశ్​లోని పెంచ్​ పార్కులో ఓ పెద్దపులి తన ఐదు పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటోంది. వాటిని లాలిస్తోంది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవతున్నాయి. వాటిని మీరూ చూసేయండి..

pench park
వైరల్​: పెంచ్​ పార్కులో పులి పిల్లల సరదా ఆటలు

మధ్యప్రదేశ్​లోని పెంచ్​ జాతీయ పార్కులో పాద్దేవ్​ అనే ఆడపులి ఇటీవల ఐదు పులి పిల్లలకు జన్మనిచ్చింది. శనివారం ఉదయం ఆ పులి తన పిల్లలతో కలిసి పార్కులో నడుస్తూ కనిపించింది. ఈ దృశ్యాలను ఓ పర్యటకుడు చిత్రీకరించాడు. సామాజిక మాధ్యమాల్లో అవి వైరల్​గా మారాయి.

వైరల్​: పార్కులో పులి పిల్లల సరదా ఆటలు
పెంచ్​ పార్కులో పాద్దేవ్​ పులి పిల్లలు

ఐదు పిల్లల్లో ఒకటి బలహీనం

పాద్దేవ్​ పిల్లలు ఐదింటిలో ఒకటి అనారోగ్యంగా ఉందని సమాచారం. దీనిపై ఆ పాద్దేవ్​ పులి​ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. మొదటి సారి ఒక ఆడపులి ఐదు పిల్లలకు జన్మనివ్వడం ఇదే తొలిసారి. 2010లో పాద్దేవ్​ జన్మించింది.

పార్కులో విహరిస్తున్న పాద్దేవ్​ పులి
రోడ్డు దాటుతున్న పులిపిల్ల
గంతులేస్తున్న పులిపిల్లలు

మొత్తం ఎన్ని పులులు ఉన్నాయి.

మూడు సార్లు ప్రసవించిన ఈ పులి.. మొత్తం 10 పిల్లలకు జన్మనిచ్చిందని పెంచ్​ పార్కు ఫీల్డ్​ డైరెక్టర్​ విక్రమ్​ సింగ్​ పరిహార్​ తెలిపారు. 2018 లెక్కల ప్రకారం ఈ పార్కులో మొత్తం 55 పులులు(పెద్దవి) ఉన్నాయని తెలిపారు. చిన్నపిల్లలతో కలిపి వీటి సంఖ్య దాదాపు 80గా ఉంటుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details