తెలంగాణ

telangana

By

Published : Aug 9, 2021, 5:02 PM IST

ETV Bharat / bharat

భారత్​పై ఉగ్ర కుట్ర- డ్రోన్​ ద్వారా 'టిఫిన్ బాక్స్' బాంబ్!

పంజాబ్​ అమృత్​సర్​కు సమీపంలోని ఓ గ్రామంలో టిఫిన్ బాక్సు బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులో ఉన్న ఈ టిఫిన్ బాక్సులో 2-3 కిలోల బరువున్న ఆర్​డీఎక్స్​ లభ్యమైందని చెప్పారు. డ్రోన్​ ద్వారా పాకిస్థాన్​ నుంచి ఈ బ్యాగును జారవిడిచారని పోలీసులు అనుమానిస్తున్నారు.

tiffin box bomb news
పంజాబ్​లో టిఫిన్ బాక్సు బాంబు

స్వాతంత్య్ర వేడుకలకు దేశం సిద్ధమవుతున్న వేళ.. పంజాబ్​లో బాంబు కనిపించడం కలకలం రేపింది. అమృత్​సర్​లోని ఓ గ్రామంలో టిఫిన్​ బాక్సులో అమర్చిన రెండు కిలోలకు పైగా బరువున్న ఆర్​డీఎక్స్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్​ నుంచి దీన్ని డ్రోన్ సాయంతో జారవిడిచారని అనుమానిస్తున్నారు.

పంజాబ్​ పోలీసులు స్వాధీనం చేసుకున్న టిఫిన్​ బాక్సు బాంబు
బ్యాగులో దొరికిన పేలుడు పదార్థాలు, తూటాలు

టిఫిన్​ బాంబు ఉన్న బ్యాగులో మరిన్ని పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయని పంజాబ్​ డీజీపీ దిన్​కర్​ గుప్తా తెలిపారు. ఆదివారం వీటిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

వివరాలు వెల్లడిస్తున్న పంజాబ్​ డీజీపీ దిన్​కర్​ గుప్తా

"టిఫిన్ బాక్సులో అమర్చిన ఐఈడీ సహా గ్రెనేడ్లు, తూటాలను ఆదివారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నాం. అమృత్​సర్​కు సమీపంలోని ధాల్కీ గ్రామంలో ఇవి లభ్యమయ్యాయి. సరిహద్దు అవతల నుంచి దీన్ని డ్రోన్ ద్వారా జారవేశారని మేము అంచనా వేస్తున్నాం. తమ గ్రామంలో డ్రోన్లు తిరుగుతున్నాయని ఆ ఊరి మాజీ సర్పంచ్​ ఒకరు పోలీసులకు తెలియజేశారు."

-దిన్​కర్​ గుప్తా, పంజాబ్ డీజీపీ

ఏడు పౌచులు ఉన్న బ్యాగులో ఓ ప్లాస్టిక్ టిఫిన్​, ఐదు గ్రెనేడ్లు, 100 రౌండ్ల 9 ఎంఎం తూటాలు, రెండు కిలోల పేలుడు వస్తువు, ఓ రిమోట్​ కంట్రోల్​ స్విచ్​ను స్వాధీనం చేసుకున్నామని డీజీపీ దిన్​కర్​ గుప్తా తెలిపారు. ఈ కేసులో జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్​జీ) సాయాన్ని తాము తీసుకున్నామని చెప్పారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్​ఎస్​జీ బృందం.. ప్రాథమిక నివేదికను సిద్ధం చేసిందని వెల్లడించారు.

"బ్యాగులో ఉన్న ఆర్​డీఎక్స్​ 2-3 కిలోల బరువు ఉంటుందని ఎన్​ఎస్​జీ నివేదికలో తేలింది. దాన్ని తగిన సమయానికి పేల్చే విధంగా అమర్చారు. రెండు 'యు' ఆకారం అయస్కాంతాలు, రిమోట్​కు సిగ్నల్​కు సంబంధించిన ఓ ప్రింటెడ్​ సర్క్యూట్​ బోర్డు లభ్యమైంది."

-దినకర్​ గుప్తా, పంజాబ్​ డీజీపీ

మరోవైపు ఈ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోందని అమృత్​సర్​ రూరల్​ ఎస్​ఎస్​పీ గుల్నీత్​ సింగ్​ తెలిపారు.

ఇదీ చూడండి:భారత్​పై మరో కుట్ర- బోర్డర్​ వద్ద 140 మంది ఉగ్రవాదులు!

ఇదీ చూడండి:Hybrid militants: భద్రతా దళాలకు సరికొత్త సవాలు!

ABOUT THE AUTHOR

...view details