తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సిలిండర్​ పేలి కూలిన పై కప్పు-  ముగ్గురు మృతి - చిత్తోర్​గఢ్​లో పేలిన సిలీండర్​

రాజస్థాన్​లోని చిత్తోర్​గఢ్​లో సిలిండర్​ పేలి ఇంటి పై కప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.

three-people-died-in-chittorgarh-due-to-cylinder-explosion
సిలీండర్​ పేలి.. పై కప్పు కూలీ... ముగ్గురు మృతి

By

Published : Mar 19, 2021, 9:54 AM IST

రాజస్థాన్​లోని చిత్తోర్​గఢ్​లో తెల్లవారుజాము 3 గంటలకు గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకే కుంటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఉదయపుర్​లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సిలీండర్​ పేలి.. పై కప్పు కూలీ

సిలిండర్ పేలిన సమయంలో బాధితులు నిద్రలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను ఇంటి యజమాని పురుషోత్తం, అతని తల్లి సజ్నీభాయి, భార్య జమునాదేవిగా గుర్తించారు. పేలుడు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఇదీ చూడండి: పోర్న్​ చిత్రం చూసి.. పసికందుపై అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details