తెలంగాణ

telangana

By

Published : May 6, 2021, 7:20 AM IST

ETV Bharat / bharat

విషాదం: పిడుగుపాటుతో ముగ్గురు మృతి

కర్ణాటకలో విషాదం జరిగింది. పిడుగుపాటు కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు.

Lightening
పిడుగుపాటు

కర్ణాటక విజయపుర జిల్లాలో విషాదం జరిగింది. భారీ వర్షం నుంచి రక్షణ పొందేందుకు అఘజలపుర్​ ప్రాంతంలో కొందరు ఓ చెట్టు కింద నిల్చోగా.. ఉన్నట్టుండి పిడుగుపడింది. ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో నాలుగు గొర్రెపిల్లలు కూడా బలయ్యాయి.

పిడుగుపాటులో తీవ్ర గాయాలాతో బయటపడిన వ్యక్తిని.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై విజయపుర రూరల్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:అక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌!

ABOUT THE AUTHOR

...view details