తెలంగాణ

telangana

By

Published : Jul 14, 2021, 9:47 PM IST

ETV Bharat / bharat

మరో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్

అనుమానిత ఉగ్రవాదుల కోసం ఉత్తర్​ప్రదేశ్ పోలీసుల వేట కొనసాగుతోంది. ఆదివారమే ఇద్దరు ఉగ్ర అనుమానితులను పోలీసులు అరెస్టు చేయగా.. తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా యూపీలోని పలు నగరాల్లో దాడులకు యత్నిస్తున్నట్లు తెలిపారు.

Three more terrorists of Al-Qaeda outfit arrested in Uttar Pradesh
మరో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్

ఉత్తర్​ప్రదేశ్​లో మరో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని షకీల్(లఖ్​నవూలోని వాజిర్​గంజ్​), మహమ్మద్ ముస్తు​క్వీం(ముజఫర్​నగర్​), మహమ్మద్ మోయిద్(లఖ్​నవూలోని న్యూ హైదర్​గంజ్​)గా గుర్తించారు. వీరంతా అల్​ఖైదాకు సంబంధం ఉన్న అన్సార్ ఘజ్వాతుల్ హింద్ ఉగ్ర సంస్థకు చెందినవారని తెలిపారు.

యూపీకి యాంటీ టెర్రర్ స్కాడ్ పోలీసులు ముషీరుద్దీన్, మిన్హాద్ అహ్మద్ అనే ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను ఆదివారమే అరెస్టు చేశారు. ప్రస్తుతం అరెస్టైన ముస్తుక్వీం.. వారిద్దరికీ సహకరిస్తున్నారని తెలిపారు. మోయిద్ పిస్తోల్ తయారు చేసి.. మిన్హాద్ ద్వారా ముస్తుక్వీంకు అందించాడని చెప్పారు. ఆయుధాలను సేకరించేందుకు మిన్హాజ్​కు షకీల్ సహకరించాడని పోలీసులు తెలిపారు.

కాన్పుర్​కు చెందిన ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, ముగ్గురు మహిళలు సైతం ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు. అరెస్టైన వ్యక్తులు సరిహద్దు ఆవల ఉన్నవారితో సంప్రదింపులు జరుపుతున్నారని, యూపీలోని పలు నగరాల్లో దాడులు జరపడమే వీరి ఉద్దేశమని వివరించారు.

ఇదీ చదవండి:'తోప్​ టీవీ' సీఈఓ అరెస్టు- నిలిచిన సేవలు!

ABOUT THE AUTHOR

...view details