ఎన్డీఎ సర్కార్ హయాంలో నిరుద్యోగం, ధరలు, పేదరికంతో పాటు ప్రభుత్వ పెద్దల స్నేహితుల సంపద పెరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ట్విట్టర్లో ఈ మేరకు కేంద్రంపై ఆయన విమర్శలు గుప్పించారు.
'మోదీ హయాంలో వారి సంపదే వృద్ధి' - మోదీపై రాహుల్ వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో నిరుద్యోగం, ధరలు, పేదరికం బాగా పెరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రభుత్వ పెద్దల స్నేహితుల ఆస్తులు అమాంతం పెరిగాయని ఆరోపించారు.

'మోదీ హయాంలో నిరుద్యోగం, ధరలు, పేదరికం పెరిగాయి'
కొవిడ్-19 విజృంభణకు ముందు దేశంలో 9.9 కోట్లుగా ఉన్న మధ్యతరగతి ప్రజలు మరింత దిగజారి పేదరకంలోకి వెళ్లారని రాహుల్ అన్నారు. ప్రస్తుతం మధ్యతరగతి ప్రజల సంఖ్య 6.6 కోట్లకు చేరిందని తెలిపే మీడియా నివేదికను ఆధారంగా చూపారు.