తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పడకల కొరత- అంబులెన్సుల్లోనే చికిత్స - అహ్మదాబాద్ సివిల్​ ఆసుపత్రి

గుజరాత్​లో కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. చికిత్స కోసం వచ్చిన బాధితులు ఆస్పత్రి వెలుపలే అంబులెన్సులలో నిరీక్షిస్తున్నారు. అహ్మదాబాద్​ సివిల్​ ఆస్పత్రిలో నెలకొన్న ఈ దుస్థితిని మాజీ క్రికెటర్​ హర్భజన్​ సింగ్​ ట్విట్టర్​లో షేర్​ చేశారు.

ahmedabad civil hospital, అహ్మదాబాద్ సివిల్​ ఆసుపత్రి
చికిత్స కోసం అంబులెన్సలలో నిరీక్షణ

By

Published : Apr 14, 2021, 3:12 PM IST

కొవిడ్​ చికిత్స కోసం అంబులెన్సలలో నిరీక్షిస్తున్న రోగులు

కరోనా మహమ్మారి విజృంభణతో గుజరాత్​లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కొవిడ్​ కేసులు పెరుగుతుండటం వల్ల ఆస్పత్రులు కిక్కిరిసాయి. అహ్మదాబాద్​ సివిల్​ ఆస్పత్రిలో బెడ్ల కొరత ఏర్పడింది. దీంతో కరోనా బాధితులు చికిత్స కోసం ఆస్పత్రి బయటే అంబులెన్సులలో నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. ఆస్పత్రి నుంచి ఎవరైనా డిశ్చార్జి అయితే కానీ మరొకరికి ప్రవేశం లేకుండా పోయింది.

కరోనా రోగులతో ఉన్న '108' వాహనాలు ఆసుపత్రి ముందు బారులు తీరిన వీడియోను మాజీ క్రికెటర్​ హర్భజన్​ సింగ్​ తన ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేశారు. 'బాధాకరమైన నిజం. దేవుడా.. దయచేసి అందర్నీ కాపాడు' అని హర్భజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో మొత్తం 1200 పడకలు ఉన్నాయి. వీటిలో 250 ఆక్సిజన్​ బెడ్లు, 50 వెంటిలేటర్ల బెడ్లు ఉన్నాయి.

మహారాష్ట్రలోని చాలా నగరాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. చాలా ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడటం వల్ల కరోనా రోగులను ఆసుపత్రి బయట.. ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో ఉంచి ఆక్సిజన్‌ అందిస్తున్నారు.

ఇదీ చదవండి :కరోనా ఉగ్రరూపం: దేశంలో మరో 1,84,372 కేసులు

ABOUT THE AUTHOR

...view details