తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సూరత్ ఘటనపై మోదీ విచారం- బాధితులకు పరిహారం

గుజరాత్​లోని సూరత్​లో జరిగిన ట్రక్కు ప్రమాదం విషాదకరమైనదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బాధితకుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించారు.

By

Published : Jan 19, 2021, 9:40 AM IST

modi, surat, accident
సూరత్ ఘటన విషాదకరం : ప్రధాని

గుజరాత్​లోని సూరత్​లో మంగళవారం జరిగిన ట్రక్కు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఇది విషాదకరమైన ఘటన అని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్​ఆర్​ఎఫ్​) నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. యాభై వేల చొప్పున పరిహారం ప్రకటించారు. సూరత్​లోని కోసంబ ప్రాంతంలో నిద్రిస్తున్న కూలీలపై లారీ దూసుకెళ్లిన ఘటనలో 15 మంది మృతిచెందారు.

గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ కూడా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

ఇదీ చదవండి :రైతులతో 10వ దఫా చర్చలు వాయిదా

ABOUT THE AUTHOR

...view details