కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన ఏడేళ్ల కాలంలో 9,52,875 మంది ఆత్మహత్య (suicide cases in india 2021) చేసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. జాతీయ నేర గణాంకాల నమోదు మండలి (ఎన్సీఆర్బీ) ద్వారా విడుదలైన అధికారిక లెక్కలే ఈ విషయాన్ని చెబుతున్నాయని పేర్కొంది. పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా ఆదివారం ఒక ప్రకటనలో ఆ గణాంకాలు విడుదల చేశారు. 2014-2020 మధ్య 69,047 మంది విద్యార్థులు, 86,851 మంది నిరుద్యోగులు, 78,303 మంది రైతులు, 35,112 మంది వ్యవసాయ కూలీలు, 1,93,795 మంది దినసరి కూలీలు, 1,52,127 మంది గృహిణులు (suicide cases in india today) బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగానే వీరు తనువు చాలించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019-20 మధ్య రైతులు/ రైతుకూలీల ఆత్మహత్యలు 19% పెరిగినట్లు గుర్తుచేశారు. గత ఏడేళ్లలో హెక్టారుకు పెట్టుబడి వ్యయం రూ.25వేల మేర పెరిగిపోగా రైతు రోజువారీ ఆదాయం రూ.26.67కి పడిపోయి, తలసరి అప్పు రూ.74వేలకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధరకంటే సగటున 40% తక్కువ ధరకే రైతులు పంటల్ని అమ్మాల్సి వస్తోందన్నారు. ప్రధానమంత్రి పంటల బీమా పథకం రైతులకు మేలుచేసే బదులు వ్యాపార సంస్థలకు రూ.26వేల కోట్ల లాభాన్ని సమకూర్చిందన్నారు.
చైనా సరిహద్దు గురించి భాజపా మాట్లాడాల్సింది