తెలంగాణ

telangana

By

Published : Dec 18, 2022, 3:11 PM IST

ETV Bharat / bharat

ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలిన వంతెన..

2017లో నిర్మించిన ఓ వంతెన ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలిపోయింది. ఈ ఘటన బిహార్​ బెగూసరాయ్​లో చోటుచేసుకుంది. ఈ వంతెనపై ట్రాఫిక్ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

the bridge over budhi gandak collapsed in Bihar
ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలిన వంతెన

బిహార్​లోని బెగూసరాయ్​లోని బుఢీ గండక్​ నదిపై ఉన్న వంతెన ఆదివారం కుప్పకూలిపోయింది. గోవింద్‌పూర్‌, రాజౌరా వెళ్లే సాహెబ్‌పుర్‌ కమల్‌ బ్లాక్‌లోని బుఢీ గండక్‌ నదిపై నిర్మించిన బిష్ణుపుర్‌ అహోక్‌ ఘాట్‌ వంతెనను ముఖ్యమంత్రి నావార్డ్ యోజన కింద 2017 సంవత్సరంలోనే పూర్తి చేశారు. ఈ వంతెన నిర్మాణాన్ని మా భగవతి నిర్మాణ సంస్థ చేపట్టింది. దీని నిర్మాణానికి రూ.13.43 కోట్లు ఖర్చు చేశారు. కానీ అప్రోచ్ రోడ్డు లేకపోవడం వల్ల.. ఈ వంతెనకు ప్రారంభోత్సవం నిర్వహించలేదు.

ఈ వంతెన కూలిపోయిన సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఓ రోహిత్‌కుమార్‌, ఎస్‌డీపీవో కుమార్‌ వీరేంద్ర, పలువురు అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ వంతెనపై వాహనాల రాకపోకలు లేనందున పెద్ద ప్రమాదం తప్పిపోయిందని స్థానికులు అంటున్నారు. అయితే, వంతెన నిర్మించిన కాంట్రాక్టర్​ను వెంటనే అరెస్టు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

"ఈ వంతెన నిర్మాణంలో భారీ దోపిడీలు జరిగాయి. వంతెన ప్రారంభానికి ముందే నదిలో మునిగిపోవటమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. వంతెనను నిర్మించిన ఏజెన్సీ కాంట్రాక్టర్‌ను వెంటనే అరెస్టు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా."
-సంజయ్ యాదవ్, నాయకుడు, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)

ABOUT THE AUTHOR

...view details