తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వింగ్​లూంగ్​.. గీతదాటితే ఇట్టే కూల్చేస్తాం..!

సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతూ ప్రస్తుతం వెనక్కి తగ్గిన చైనా.. పాక్​ను మనపై ఎగదోసేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశానికి శత్రువును టార్గెట్​ చేయగల సత్తా ఉన్న వింగ్​లూంగ్​ సాయుధ డ్రోన్లను సమకూర్చింది. అయితే.. ఇవి భారత భూభాగంలోకి తొంగిచూస్తే కూల్చేస్తామని సైన్యం హెచ్చరించింది.

By

Published : Dec 27, 2020, 5:55 AM IST

వింగ్​లూంగ్​ డ్రోన్లు భారత భూభాగంలోకి తొంగిచూస్తే కూల్చేస్తామని సైన్యం హెచ్చరించింది. చైనా తన సైనిక అవసరాల కోసం తయారు చేసిన వింగ్​లూంగ్​ సాయుధ డ్రోన్లు పాకిస్థాన్​కు విక్రయించింది. జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ, లద్దాఖ్​లోని వాస్తవాధీనరేఖ వద్ద గగనతలాన్ని రాడార్లు చాలా నిశితంగా పరిశీలిస్తాయని, వాటిని ఎదుర్కొంటాయని సైనికాధికారులు తెలిపారు. సాయుధ డ్రోన్లు గీత దాటితే సులువుగా కూల్చివేయవచ్చని మాజీ ఎయిర్​ ఫోర్స్​ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మానవరహిత వైమానిక వాహనాలు, నియంత్రణ రేఖ వద్ద లేదా వాస్తవాధీనరేఖ దాటకుండా గగనతలం నుంచి భూమిపైకి ఆయుధాలను ప్రయోగించేందుకు దోహదపడతాయి. వింగ్​లూంగ్​ సాయుధ డ్రోన్ల గురించి చైనా, పాక్​ ఎంత ప్రచారం చేసినా వాటిని సులభంగా కూల్చివేస్తామని సైన్యం ప్రకటించింది.

ఇదీ చూడండి:'భాజపా వ్యతిరేక పార్టీలు ఏకమైతేనే బలమైన ప్రతిపక్షం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details