గణతంత్ర దినోత్సవానికి ముందు భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను జమ్ముకశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. వారి స్థావరంపై దాడి చేసి ఇద్దరు ముష్కరులను సోమవారం.. అరెస్ట్ చేశారు. భారీగా ఆయుధాలను, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఉగ్రకుట్ర భగ్నం - ఇద్దరు ముష్కరులు అరెస్ట్ - terror module busted in jammu kashmir
రిపబ్లిక్ డే లక్ష్యంగా ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశారు జమ్ము కశ్మీర్ పోలీసులు. జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఇద్దరు ముష్కరులను సోమవారం అరెస్ట్ చేశారు. వారి స్థావరాన్ని ధ్వంసం చేసి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ చేసిన ఇద్దరు తీవ్రవాదులను ఉమర్ అహ్మద్ మాలిక్, సుహేల్ అహ్మద్ మాలిక్గా గుర్తించారు పోలీసులు. వారు అనంత్నాగ్ బిజ్బెహరా సెమ్తాన్ ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిపారు. ఈ ఇద్దరు దుండగులు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్ధరించారు. జైషే మహ్మద్ సంస్థ ఉగ్రవాది అఖిబ్ అలియాస్ ఆల్ఫా.. వీరికి డ్రోన్స్ ద్వారా ఆయుధాలను అందించినట్లు తెలిపారు. ఉగ్రకుట్రపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.
ఇదీ చదవండి :జవాన్ల అత్యవసర వైద్యానికి 'రక్షిత' సేవలు ప్రారంభం