తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మైనర్​పై కిరోసిన్​ పోసి సజీవదహనం- ప్రియుడి పనే! - ఉత్తర్​ప్రదేశ్​ న్యూస్​

Teenager Burnt Alive: ఓ బాలికపై కిరోసిన్​ పోసి నిప్పంటించిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బరేలీలో జరిగింది. 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది. కొందరు యువకులు ఇంట్లోకి చొరబడి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది బాధితురాలి తల్లి.

Teenager burnt alive
Teenager burnt alive

By

Published : Jan 6, 2022, 6:50 PM IST

Teenager Burnt Alive: ఉత్తర్​ప్రదేశ్​ బరేలీలో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికను సజీవదహనం చేశారు దుండగులు. నిందితుల్లో బాధితురాలి ప్రియుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంట్లో వేర్వేరు గదుల్లో పనిచేసుకుంటుండగా.. కొందరు యువకులు వచ్చి యువతిపై దాడి చేశారని పోలీసులకు వివరించింది బాధితురాలి తల్లి. కిరోసిన్​ పోసి నిప్పంటించి.. అక్కడి నుంచి పారిపోయారని చెప్పింది.

''ఘటనా సమయంలో నా భర్త ఇంట్లో లేడు. రైస్​ మిల్లులో పని కోసం వెళ్లాడు. ఇద్దరు కుమారులు కూడా బయటకు వెళ్లారు.''

- బాధితురాలి తల్లి

బాధిత యువతిని బహేదిలోని సీహెచ్​సీకి తీసుకెళ్లగా.. బరేలీకి తరలించాలని వైద్యులు చెప్పారు. అక్కడికి వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయింది యువతి. నిందితుల్లో ఒకరితో ఆమె ప్రేమ వ్యవహారం నడిపినట్లు.. పోలీసులకు సమాచారం అందింది.

ఘటనా స్థలం నుంచి యువతి దుస్తులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: పాక్​ టీనేజర్​తో భారతీయురాలి 'లూడో లవ్'​- బోర్డర్ క్రాస్​ చేసేలోగా...

మోదీ దీర్ఘాయువు కోసం పూజలు- మృత్యుంజయ జపాలు

ABOUT THE AUTHOR

...view details