తెలంగాణ

telangana

పీపీఈ కిట్లతో టీచర్​కు విద్యార్థుల అంత్యక్రియలు

కొవిడ్​తో చనిపోయిన ఉపాధ్యాయునికి విద్యార్థులే అంత్యక్రియలు నిర్వహించారు. పీపీఈ కిట్లు ధరించి తమ మాస్టారు మృతదేహాన్ని మోసుకెళ్లారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

By

Published : May 17, 2021, 7:46 PM IST

Published : May 17, 2021, 7:46 PM IST

Teacher died due to corona: Funeral by students wearing PPE kit
పీపీఈ కిట్లతో టీచర్ కు విద్యార్థుల అంత్యక్రియలు

కరోనాతో మృతిచెందిన ఉపాధ్యాయుడికి పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు విద్యార్థులు. ఈ ఘటన కర్ణాటకలోని బళ్లారిలో జరిగింది.

మాస్టారుకు అంత్యక్రియలు చేస్తోన్న విద్యార్థులు

సిరిగుప్పకు చెందిన 63 ఏళ్ల ఈశ్వరప్ప అనే ఉపాధ్యాయుడు కొవిడ్​తో శనివారం చనిపోయారు. ఆయన పూర్వ విద్యార్థులే పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అంత్యక్రియలు వారే జరిపారు.

సిరిగుప్ప తాలుకాలోని పలు గ్రామాల్లో ఉపాధ్యాయునిగా సేవలందించారు ఈశ్వరప్ప. విద్యార్థులకు ఆయనంటే అమితమైన అభిమానం.

ఇదీ చూడండి:'వైరస్​ నుంచి కోలుకున్నా.. ఇంటికి వెళ్లను'

ABOUT THE AUTHOR

...view details