తెలంగాణ

telangana

By

Published : Nov 29, 2022, 12:50 PM IST

ETV Bharat / bharat

విద్యార్థినిపై టీచర్​ అత్యాచారయత్నం.. విదేశీ మహిళ ఎదుట డ్రైవర్ వికృత చేష్టలు

ఉత్తరాఖండ్​లో అమానవీయ ఘటన జరిగింది. మైనర్​ విద్యార్థినిపై అత్యాచారయత్నం చేశాడు ఓ ఉపాధ్యాయుడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, అమెరికా చెందిన మహిళ ఎదుట ఓ క్యాబ్​ డ్రైవర్ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఆ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.

teacher molestation student
విద్యార్థినిపై టీచర్ అత్యాచారయత్నం

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు.. మైనర్​ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ చమోలీలో జరిగింది. బాధితురాలిని ప్రలోభపెట్టి అడవిలోకి తీసుకెళ్లి వేధింపులకు గురిచేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నిందితుడు.. మైనర్​ను అడవిలోని ఏకాంత ప్రదేశానికి రమ్మని మెసేజ్ చేశాడు. అక్కడిరాగానే బాలికను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. ఈ దాడికి చూసిన స్థానికులు అక్కడికి వచ్చేసరికి నిందితుడు పరారయ్యాడు. బాధితురాలిని స్థానికులు ఆమె ఇంటికి చేర్చారు. కుటుంబ సభ్యులకు తనపై జరిగిన దాడి గురించి చెప్పింది బాధితురాలు. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అమెరికా మహిళ ఎదురుగా వికృత చేష్టలు..
అమెరికాకు చెందిన 40 ఏళ్ల మహిళ ముందు అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ క్యాబ్ డ్రైవర్​. క్యాబ్​లో బాధితురాలు ప్రయాణిస్తున్న సమయంలో వికృత చేష్టలు చేశాడు. నిందితుడిని యోగేంద్ర ఉపాధ్యాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు.. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త అని తెలిపారు. కొంత కాలం క్రితం భారత్​కు ఆమె వచ్చిందని వెల్లడించారు. క్యాబ్​లో ఉన్న ప్రయాణికులందరూ దిగిపోయాక అతడు వికృత చేష్టలకు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ముంబయిలో జరిగిందీ ఘటన.

అసభ్యకర వీడియోలు తీసి.. పోస్ట్ చేస్తా..
ఉత్తరాఖండ్.. హరిద్వార్​లో ఓ వివాహిత పట్ల అత్తింటి వారు దారుణంగా ప్రవర్తించారు. అదనపు కట్నం తీసుకురాకపోతే చంపేస్తామని బెదిరించారు. ఈ ఘటనపై బాధితురాలు అత్తమామలు, భర్త నారంగ్​, బావపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. అదనపు కట్నం తీసుకురాకపోతే అసభ్యకర వీడియోలు, ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెడతానని తన భర్త బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. గతేడాది జనవరిలో తనకు పెళ్లి జరిగిందని.. అప్పటి నుంచి తనను వరకట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది.

పోలీస్ క్వార్టర్స్​లో..
ఉత్తర్​ప్రదేశ్ సోన్​భద్రలోని పోలీస్ క్వార్టర్స్​లో సెక్స్​ రాకెట్​, డ్రగ్స్ అక్రమ సరఫరా కలకలం రేపుతోంది. ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ల భార్యలు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని ఎస్పీకి 17 మంది పోలీసులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్​ కూడా ఉండడం విశేషం. ఈ కేసును కమిషనర్​ ఆఫ్ పోలీస్​కు అప్పగించారు ఎస్పీ. ఈ కేసుపై రెండు రోజుల్లో నివేదిక అందించాలని ఆయన కమిషనర్​ ఆఫ్ పోలీస్​కు ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details