రాజస్థాన్కు చెందిన మురారీ లాల్ అనే వ్యక్తికి ట్యాక్స్ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. రూ.5 కోట్ల మోసానికి పాల్పడ్డాడని పేర్కొంటూ అరెస్టు చేసేందుకు ఇంటి ముందు వాలిపోయారు. ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదువుకొని, ఓ మారుమూల గ్రామంలో పశువుల కాపరిగా పనిచేస్తున్న మురారీ లాల్కు.. అధికారుల మాటలు విని గుండె ఆగినంత పనైంది. గతంలో జరిగిన పరిణామాలను మురారీ లాల్ గుర్తు తెచ్చుకునే సరికి జరిగిందంతా అవగతమైంది. తనను వేరే వ్యక్తి మోసం చేశాడని అర్థమైంది.
గతంలో ఓ స్టూడియోలో పనిచేసే సమయంలో మురారీ లాల్కు ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. సొంతంగా వ్యాపారం పెట్టుకునేందుకు సహాయం చేస్తానని అతడు మురారీ లాల్కు హామీ ఇచ్చాడు. నెల రోజుల తర్వాత అదే వ్యక్తి ఫోన్ చేసి లోన్ ఇప్పిస్తానంటూ ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్మెంట్ వంటి వివరాలను తీసుకున్నాడు.
వీటిని ఇవ్వగానే తనకు ఆ వ్యక్తి నుంచి ఫోన్లు రావడం ఆగిపోయాయని మురారీ లాల్ 'ఈటీవీ భారత్'తో వాపోయాడు. తన పేరు మీదనే కోట్లలో టర్నోవర్ ఉన్న కంపెనీ నమోదై ఉందని ఇప్పుడు తెలిసిందని చెప్పాడు. మురారీ లాల్ పేరు మీద నమోదైన కంపెనీ పేరిట గుర్తుతెలియని ఆ వ్యక్తి మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.