తెలంగాణ

telangana

By

Published : Jan 27, 2021, 11:28 AM IST

Updated : Jan 27, 2021, 12:22 PM IST

ETV Bharat / bharat

జైలు నుంచి శశికళ విడుదల- ఇంకా ఆస్పత్రిలోనే..

తమిళనాడు దివంగత నేత జయలలిత స్నేహితురాలు శశికళకు కారాగారం నుంచి విముక్తి లభించింది. అవినీతి కేసుల్లో నాలుగేళ్ల క్రితం జైలుకెళ్లిన ఆమె.. శిక్షా కాలం పూర్తైనందున బుధవారం విడుదలయ్యారు. అయితే.. ఈ నెల 20న కరోనా బారినపడ్డ శశికళ.. బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

SASIKALA RELEASED FROM JAIL
జైలు నుంచి శశికళ విడుదల- కానీ ఆస్పత్రిలోనే..

అన్నాడీఎంకే బహిష్కృత నేత, జయలలిత నిచ్చెలి వీకే శశికళ(63) జైలు నుంచి విడుదలయ్యారు. అవినీతి కేసులో నాలుగేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెను.. శిక్షాకాలం ముగిసినందున ఇవాళ విడుదల చేశారు అధికారులు. జనవరి 20న కరోనా బారినపడ్డ శశికళ.. ప్రస్తుతం విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆమె విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జైలు అధికారులు ఆస్పత్రిలోనే పూర్తి చేశారు.

జైలు నుంచి విడుదలైనప్పటికీ అనారోగ్య కారణాల దృష్ట్యా ఆమె కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందనున్నారు. ఇంకో 10 రోజులు శశికళకు చికిత్స అవసరమని ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్​‌ అన్నారు.

స్వీట్ల పంపిణీ..

శశికళ జైలు నుంచి విడుదలైన సందర్భంగా.. ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. విక్టోరియా ఆస్పత్రి ఎదుట భారీ సంఖ్యలో మద్దతుదారులు హాజరై స్వీట్లు పంచుకున్నారు.

స్వీట్లు పంచుతున్న అభిమానులు
మిఠాయిలు పంచుకుని వేడుక..
ఫ్లకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ..

ఇదీ చదవండి:శెభాష్​ అనిపించుకున్నారు- పద్మాలు సాధించారు!

Last Updated : Jan 27, 2021, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details