తమిళనాడులో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే ఇద్దరు వైద్యులు.. మహిళా సహోద్యోగులపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారిని లైంగిక వేధింపులకు గురి చేశారు. నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
అసలేమైందంటే..?
చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎస్. వెట్రిసెల్వన్(35), ఎన్.మోహన్ రాజ్(28) వైద్యులుగా పని చేస్తున్నారు. ఆగస్టులో.. కరోనా నిబంధనల కారణంగా.. తమ ఆస్పత్రిలో పని చేసే మహిళా సహోద్యోగులతో కలిసి టి.నగర్లోని ఓ ఆస్పత్రిలో క్వారంటైన్లో ఉన్నారు.
ఆ సమయంలో ఓ వైద్యురాలిపై వెట్రి సెల్వన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో వైద్యుడు మోహన్ రాజ్ కూడా మరో వైద్యురాలిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. అప్పటి నుంచి వారిద్దరు చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు.