తెలంగాణ

telangana

By

Published : Jun 16, 2021, 10:46 PM IST

ETV Bharat / bharat

కేరళలో కొత్తగా 13,270 కరోనా కేసులు

వివిధ రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తమిళనాడులో కొత్తగా 10,448 కేసులు వెలుగుచూశాయి. కేరళలో 13,270.. మహారాష్ట్రలో కొత్తగా 10,107 కేసులు నమోదయ్యాయి.

new-infections
కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తమిళనాడులో కొత్తగా 10,448 కేసులు నమోదయ్యాయి. 434 మంది ప్రాణాలు కోల్పోయారు. 21,058 మంది డిశ్చార్జ్ అయ్యారు.

మహారాష్ట్రలో 10,107 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 270 మంది చనిపోయారు. దీంతో మొత్తం ఆ రాష్ట్రంలో కరోనా ధాటికి కన్నుమూసిన వారి సంఖ్య 1,15,390 చేరింది.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

  • దిల్లీలో కొత్తగా 212 కేసులు వెలుగులోకి వచ్చాయి. 25 మంది మరణించారు.
  • కర్ణాటకలో 7345 కేసులు బయటపడ్డాయి. 148 మంది మృతి చెందారు.
  • గుజరాత్​లో 298 మందికి కరోనా నిర్ధరణ అయింది. ఐదుగురు వైరస్​ ధాటికి బలయ్యారు.
  • కేరళ​లో 13,270 కేసులు బయటపడ్డాయి. 147 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు విడిచారు.
  • రాజస్థాన్​లో కొత్తగా 280 మందికి వైరస్​ సోకింది. మరో 9 మంది మరణించారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 310 మందికి కరోనా సోకగా.. మరో 50 మంది వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
  • మధ్యప్రదేశ్​లో కొత్తగా 160 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. మరో 34 మంది మృతి చెందారు.

ఇదీ చదవండి:'పిల్లల్లో కరోనా'పై కేంద్రం మార్గదర్శకాలు

ABOUT THE AUTHOR

...view details