బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్పై సుప్రీం కోర్టు మండిపడింది. ఆమె నిర్మించిన 'ఎక్స్ఎక్స్ఎక్స్' వెబ్ సిరీస్లో అభ్యంతరకరమైన కంటెంట్ ఉందని తేల్చిచెప్పింది. "దీని గురించి ఏదైనా చేయాలి. మీరు ఈ దేశ యువ తరం మైండ్లను కలుషితం చేస్తున్నారు" అని జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సీటీ రవికుమార్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.
బోల్డ్ కంటెంట్తో 'ఎక్స్ఎక్స్ఎక్స్' వెబ్ సిరీస్.. నిర్మాత ఏక్తా కపూర్పై సుప్రీం సీరియస్.. - సుప్రీంకోర్టు ఏక్తా కపూర్ కేసు
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అనవసరంగా పిటిషన్ వేసినందుకు కోర్టు ఫీజులు చెల్లించాలని ఆదేశించింది. తనపై జారీ అయిన అరెస్టు వారెంట్లను సవాల్ చేస్తూ సుప్రీం కోర్డును ఆశ్రయించింది.
![బోల్డ్ కంటెంట్తో 'ఎక్స్ఎక్స్ఎక్స్' వెబ్ సిరీస్.. నిర్మాత ఏక్తా కపూర్పై సుప్రీం సీరియస్.. supreme court slams ekta kapoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16645606-thumbnail-3x2-ekta.jpg)
ఇదే విషయంపై ఏక్తా కపూర్ తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గిని.. 'మీరు ఎలాంటి ఛాయిస్ను ప్రజలకు అందిస్తున్నారు?' అని కోర్టు ప్రశ్నించింది. దీనికి స్పందించిన ముకుల్.. ఇంతకుముందు ఇలాంటి విషయంలో కపూర్కు రక్షణ కల్పించారని ఒప్పుకున్నారు. అయితే ఈ దేశంలో ఎవరికి నచ్చిన పని వారు చేయొచ్చని.. ఆ కంటెంట్ చందాదారులు మాత్రమే చూడొచ్చని సమాధానమిచ్చారు.
ముకుల్ సమాధానానికి చిర్రెత్తుకొచ్చిన ధర్మాసనం.. 'ప్రతిసారి ఇలాగే చేస్తే.. దాన్ని కోర్టు సమర్థించదు' అని ఘాటుగా వ్యాఖ్యనించింది. ఇలాంటి పిటిషన్ అత్యున్నత ధర్మాసనంలో వేసినందుకు కోర్టు ఖర్చులన్నీ మీరే కట్టాలంది. ఈ విషయం తన క్లయింట్ కపూర్కు చెప్పమని ముకుల్ అడిగింది. అనంతరం ఇలాంటి అన్యాయాన్ని ఎదురించలేని వారి కోసం మాత్రమే ఈ అత్యున్నత ధర్మాసనం పని చేస్తుందని వ్యాఖ్యానించింది.
అయితే సైనికులను కించపరిచేలా, వారి కుటుంబాల మనోభావాలు దెబ్బతినేలా ఏఎల్టీ బాలాజీ ఓటీటీ ప్లాట్ఫాంలో వచ్చిన 'ఎక్స్ఎక్స్ఎక్స్' వెబ్ సిరీస్పై శంభు కుమార్ అనే రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాత ఏక్తా కపూర్పై అరెస్ట్ వారంట్లు జారీ అయ్యాయి. దీంతో కపూర్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే కపూర్పై తీవ్ర స్థాయిలో మండిపడిన ధర్మాసనం.. హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరాలను ఎప్పటికప్పడు తెలియజేసేందుకు ఓ లోకల్ లాయర్ని నియమించింది.