తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హోంవర్క్ అడిగినందుకు టీచర్​పై కాల్పులు! - గాజియాబాద్‌

హోం వర్క్ సరిగా చేయట్లేదని మందలించిన గురువుపైనే కక్షకట్టి ఏకంగా కాల్పులు జరిపాడో విద్యార్థి. ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. టీచర్ ఫిర్యాదుతో ఆ విద్యార్థిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

student-fire-on-teacher-after-scolded-for-not-doing-homework-in-ghaziabad
హోంవర్క్ చేయలేదని అడిగిన టీచర్​పై విద్యార్థి కాల్పులు

By

Published : Mar 7, 2021, 10:57 AM IST

పాఠాలు చెప్పే గురువుపైనే కాల్పులకు తెగబడ్డాడో విద్యార్థి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్‌లోని మురాద్‌నగర్​లో జరిగింది. కాల్పులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అయితే.. హోం వర్క్ సరిగా చేయట్లేదని ఉపాధ్యాయుడు మందలించడం వల్ల కక్షకట్టిన విద్యార్థి.. కాల్పులకు ఒడిగట్టినట్టు అనుమానిస్తున్నారు.

మందలించినందుకే..?

తన పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి ఒకరు.. తనపై కాల్పులు జరిపి తప్పించుకున్నాడని సచిన్ అనే ఉపాధ్యాయుడు పోలీసులను ఆశ్రయించారు. తనకు స్వల్పంగా గాయాలైనట్లు వివరించారు.

ఈ ఘటన వెనకున్న కారణాలు ఇంకా తెలిసిరాలేదు. అయితే.. విద్యార్థి హోంవర్క్ చేయనందుకు అందరి ముందు మందలించిన తరువాత.. అతను కోపంతో టీచర్​పై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని ప్రకటించారు.

ఇదీ చదవండి:టికాయిత్​కు బెదిరింపు.. అదుపులోకి నిందితుడు

ABOUT THE AUTHOR

...view details