తెలంగాణ

telangana

వైరల్​: పోలీసులపై వ్యాపారుల రాళ్ల దాడి

మధ్యప్రదేశ్​ సింగరౌలీ జిల్లాలో పోలీసులు, కూరగాయల వ్యాపారుల మధ్య ఘర్షణ తలెత్తి ఉద్రిక్తతలకు దారి తీసింది. మార్కెట్​ను వేరే ప్రాంతానికి తరలించటానికి వచ్చిన పోలీసులపై.. వ్యాపారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

By

Published : May 10, 2021, 8:23 PM IST

Published : May 10, 2021, 8:23 PM IST

Stone pelting on Police by vegetable seller's
పోలీసులపై రాళ్లదాడి

పోలీసులపై రాళ్లదాడి

మధ్యప్రదేశ్​ సింగరౌలీ జిల్లా హిర్వా గ్రామంలో పోలీసులు, కూరగాయల వ్యాపారుల మధ్య ఘర్షణ చెలరేగింది. మార్కెట్​ను వేరే ప్రాంతానికి తరలించటానికి వచ్చిన పోలీస్​ సిబ్బందిపై.. వ్యాపారులు రాళ్లు రువ్వారు.

అసలేం జరిగింది?

సింగరౌలీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.. మార్కెట్​ ప్రాంతాన్ని తరలించేందుకు హిర్వా గ్రామానికి వచ్చారు. మార్కెట్​ను ఖాళీ చేయాలని కూరగాయల వ్యాపారులను ఆదేశించారు. దానికి వ్యాపారులు ససేమిరా అన్నారు. దీంతో కొత్వాలీ స్టేషన్​కు సమాచారమిచ్చారు అధికారులు. దీంతో అక్కడకు వచ్చిన పోలీసులపై వ్యాపారులు రాళ్లు రువ్వారు. పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

ఇదీ చదవండి :వరుడు రెండో ఎక్కం చెప్పలేదని పెళ్లి రద్దు

ABOUT THE AUTHOR

...view details