తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కన్నడనాట కరోనా విలయం- మహారాష్ట్రలో మృత్యుఘోష - యూపీలో కరోనా మరణాలు

కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కరోనా విలయం కొనసాగుతోంది. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా వైరస్‌ వ్యాప్తి ఆగడం లేదు. మహారాష్ట్రలో కేసులు, మరణాలు మళ్లీ పెరిగాయి. యూపీలో రోజువారీ మరణాలు తొలిసారి 350 మార్కును దాటాయి.

Karnataka Covid-19 Update
మహారాష్ట్ర కరోనా కేసులు

By

Published : May 4, 2021, 10:08 PM IST

మహారాష్ట్రలో కొత్త కేసుల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ.. మరణాలు మాత్రం భారీగానే నమోదయ్యాయి. తాజాగా 51,880 కేసులు నమోదవగా.. 891 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 65,934 మంది కోలుకోవడం విశేషం.

కర్ణాటకలోనూ కొవిడ్​ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 44,631 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 292 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మందికిపైగా వైరస్​ను జయించారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17 లక్షలకు చేరువైంది.

వివిధ రాష్ట్రాల్లో కేసులు, మరణాల వివరాలు..

  • కేరళలో తాజాగా 37,190 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 118 మంది చనిపోయారు.
  • తమిళనాడులో ఒక్కరోజే 21,228 మందికి వైరస్ సోకగా.. మరో 144 మంది మృతి చెందారు.
  • రాజస్థాన్​లో కొత్తగా 16,984 కేసులు నమోదవగా.. మరో 154 మంది మరణించారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో తొలిసారిగా 350పైగా కొవిడ్​ మరణాలు నమోదయ్యాయి. మరో 12,500 మంది కరోనా బారినపడ్డారు.
  • బంగాల్​లో మరో 17,639 మంది పాజిటివ్​గా తేలగా.. మరో 107 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:సామాజిక ఉద్యమకారుడు ట్రాఫిక్​ రామస్వామి కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details