తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోనియాకు సలహాలు ఇచ్చేందుకు 3 కమిటీలు

విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ 3 కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. 3 కమిటీల్లోనూ మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​కు చోటు దక్కింది.

By

Published : Nov 20, 2020, 4:36 PM IST

Sonia sets up panel on eco, foreign affairs and nat security, Manmohan Singh part of all three
సోనియాకు సూచనల కోసం 3 కమిటీల ఏర్పాటు

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ 3 కమిటీలు ఏర్పాటు చేశారు. పలు విధానపరమైన నిర్ణయాల విషయంలో సోనియాకు వీరు తగిన సూచనలు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇదీ చూడండి:గోవాకు సోనియా- కొంతకాలం అక్కడే మకాం

ఆర్థిక, విదేశీ, జాతీయ భద్రతా వ్యవహారాలపై ఏర్పాటు చేసిన ఈ 3 కమిటీల్లోనూ మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ సభ్యుడిగా ఉన్నారు.

  • ఆర్థిక వ్యవహారాల కమిటీలో మన్మోహన్​తో పాటు చిదంబరం, మల్లిఖార్జున ఖర్గే, దిగ్విజయ్​ సింగ్​, జైరాం రమేశ్​కు చోటు. ఈ కమిటీకి కన్వీనర్​గా జైరాం.
  • విదేశీ వ్యవహారాల కమిటీలో ఆనంద్​ శర్మ, శశి థరూర్​, సల్మాన్​ ఖుర్షిద్​, సప్తగిరి ఉలక సభ్యులు. ఖుర్షిద్​ ఈ కమిటీకి కన్వీనర్.
  • విన్సెంట్​ పాల కన్వీనర్​గా ఎంపికైన జాతీయ భద్రతా వ్యవహారాల కమిటీలో మన్మోహన్​తో పాటు గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, వైతిలింగం సభ్యులు.

ABOUT THE AUTHOR

...view details