కర్ణాటకలో కరోనా ఉద్ధృతికి ఈ దృశ్యాలు అద్దంపడుతున్నాయి. తన తల్లిదండ్రులను కాపాడుకోవడం కోసం.. ఓ కొడుకు పడే ఆరాటం సగటు మనిషిని కదిలిస్తున్నాయి.
ఇంట్లోని ఒక గదిలో కళ్ల ముందే తల్లి మృతదేహాన్ని పెట్టుకుని.. మరో గదిలో చావుబతుకుల మధ్య ఉన్న తండ్రినైనా కాపాడుకునేందుకు ఆ యువకుడు చేస్తున్న ప్రయత్నం హృదయవిదారకమనే చెప్పుకోవాలి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
ఇదీ జరిగింది..
బెంగళూరు బీటీఎమ్ లేఅవుట్లో నివసిస్తున్న ఓ వ్యక్తి తన తల్లి తండ్రులను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. కొవిడ్ సోకిన ఆయన తల్లితండ్రులకు.. ఆసుపత్రిలో పడక, ఆక్సిజన్ దొరకలేదని ఏకంగా ఇంటినే ఆస్పత్రిగా మార్చేశాడు.