తెలంగాణ

telangana

ఉగ్రవాదులతో లింకులు- ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు

By

Published : Sep 22, 2021, 4:53 PM IST

Updated : Sep 22, 2021, 5:22 PM IST

ఆరుగురు ఉద్యోగులను విధుల నుంచి (Employees dismissed in Kashmir) తొలగించింది జమ్ము కశ్మీర్​ ప్రభుత్వం. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో వారిపై వేటు వేసింది.

Employees dismissed in Kashmir
కశ్మీర్​లో ప్రభుత్వ ఉద్యోగులపై వేటు

ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులపై జమ్ముకశ్మీర్ ప్రభుత్వం (Employees dismissed in Kashmir) వేటు వేసింది. ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయన్న ఆరోపణలతో వీరిని విధుల నుంచి తొలగించింది. వీరిని డిస్మిస్ చేయాలని ప్రభుత్వం ఏర్పాటు కమిటీ సిఫార్సు చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.

వేటు వీరిపైనే

  • అబ్దుల్ హమిద్ వాని- టీచర్- అనంతనాగ్ జిల్లా బిజ్​బెహారా ప్రాంతం
  • జాఫర్ హుస్సేన్ భట్- కానిస్టేబుల్- కిష్టావర్
  • మహ్మద్ రఫీ భట్- రోడ్లు, భవనాల శాఖలో జూనియర్ అసిస్టెంట్- కిష్టావర్
  • లియాకత్ అలీ కక్రూ- టీచర్- బారాముల్లా
  • తారిక్ మెహ్మూద్ కోహ్ల్- అటవీశాఖ రేంజ్ అధికారి- పూంచ్
  • షౌకత్ అహ్మద్ ఖాన్- కానిస్టేబుల్- బుద్గామ్

ఈ టీచర్.. ఉగ్ర కమాండర్!

టీచర్ ఉద్యోగంలో చేరకముందు అబ్దుల్ హమిద్ వాని (Abdul Hamid Wani).. అల్లా టైగర్స్ ఉగ్రవాద సంస్థ​కు జిల్లా కమాండర్​గా పనిచేసే వాడని అధికారులు తెలిపారు. పలుకుబడి ఉపయోగించి ఎలాంటి సెలక్షన్ ప్రక్రియ లేకుండానే ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరినట్లు గుర్తించారు. బుర్హాన్ వాని ఎన్​కౌంటర్ తర్వాత జరిగిన నిరసన కార్యక్రమాల్లో కీలక ప్రసంగాలు చేశాడని, వేర్పాటువాద భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నాడని తెలిపారు. (Employees dismissed in Kashmir)

ముష్కరుల కోసం పనిచేసే కానిస్టేబుల్

జమ్ము కశ్మీర్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్​గా పనిచేస్తున్న జాఫర్ హుస్సేన్ భట్ (Jaffer Hussain Butt).. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని 2019లో ఎన్ఐఏ అతడిని అరెస్టు చేసింది. అదే ఏడాది సెప్టెంబర్​ 30న బెయిల్​పై బయటకు వచ్చాడు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు తన కారును అందించాడన్నది ప్రధాన ఆరోపణ. ఇది తాజాగా రుజువైంది. (Employees dismissed in Kashmir)

ముష్కరులకు సకల సౌకర్యాలు

జూనియర్ అసిస్టెంట్ మహ్మద్ రఫీ భట్.. కిష్టావర్​లోని హిజ్బుల్ తీవ్రవాదులకు లాజిస్టిక్ సౌకర్యాలు కల్పిస్తున్నాడు. ఉగ్రవాదులు తమ ప్రణాళికలను అమలు చేసేందుకు కావాల్సిన వాతావరణాన్ని కల్పిస్తున్నాడు. ఇతడిని ఎన్ఐఏ గతంలోనే అరెస్టు చేయగా.. ప్రస్తుతం బెయిల్​పై ఉన్నాడు. (Employees dismissed in Kashmir)

ఉగ్ర శిక్షిత టీచర్!

లియాకత్ అలీ కక్రూ 1983 నుంచి బారాముల్లాలో టీచర్​గా పనిచేస్తున్నాడు. పలు ఆరోపణలపై 2001లో అరెస్టయ్యాడు. స్థానికంగా ఉగ్రశిక్షణ తీసుకున్నాడని అప్పుడు వెల్లడైంది. అతని వద్ద నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజా సంరక్షణ చట్టం కింద 2002లో నిర్బంధించారు. 2021లో లియాకత్ నుంచి రెండు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. (Employees dismissed in Kashmir)

స్మగ్లింగ్ చేసే రేంజ్ ఆఫీసర్

అటవీశాఖ రేంజ్ అధికారిగా పనిచేస్తున్న తారిక్ మెహమూద్ కోహ్ల్.. ఆయుధాలను అక్రమంగా సరఫరా చేస్తున్నాడు. పాకిస్థాన్ నుంచి వచ్చే నకిలీ కరెన్సీ, డ్రగ్స్, పేలుడు పదార్థాలను ఉగ్రవాదులకు చేరవేస్తున్నాడు. ఉగ్రవాదులతో ఇతడు ఇప్పటికీ టచ్​లో ఉన్నాడని అధికారులు తెలిపారు. 2010లో ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. (Employees dismissed in Kashmir)

ఆయుధాలు లూటీ చేసే పోలీస్!

బుద్గాంకు చెందిన కానిస్టేబుల్ షౌకత్ అహ్మద్ ఖాన్.. తాను పని చేసే ఎమ్మెల్సీ ఇంట్లో నుంచి ఆయుధాలను లూటీ చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీనిపై రాజ్​బాఘ్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. పీఎస్ఏ కింద ఇతన్ని నిర్బంధంలో ఉంచారు అధికారులు. (Employees dismissed in Kashmir)

ఈ ఏడాది జులైలోనూ 11 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది జమ్ము యంత్రాంగం. వేటు పడినవారిలో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కుమారులు ఇద్దరు కూడా ఉన్నారు. ఈ వార్త పూర్తి వివరాల కోసం లింక్​పై క్లిక్ చేయండి.

ఇదీ చదవండి:మెడలో టైర్లు పెట్టి.. ప్రేమజంటతో డ్యాన్స్‌ చేయించి..

Last Updated : Sep 22, 2021, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details