తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పవార్​తో పీకే రెండోసారి- సరికొత్త రాజకీయాలకు ఆరంభమా? - శరద్ పవార్​తో ప్రశాంత్ కిశోర్ భేటీ

బంగాల్​లో టీఎంసీకి తిరుగులేని విజయాన్ని అందించిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​తో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రెండు సార్లు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బంగాల్​ గాలిని దేశమంతా వ్యాపించేలా చేసి 2024 లోక్​సభ ఎన్నికల్లో భాజపాకు చెక్​ పెట్టేలా ఇద్దరూ వ్యూహాలు రచిస్తున్నారేమోననే ప్రచారం ఊపందుకుంది.

Sharad Pawar met Prashant Kishor in Delhi, will attend Rashtra Manch meeting tomorrow
పవార్​తో పీకే రెండోసారి- సరికొత్త రాజకీయాలకు ఆరంభమమా?

By

Published : Jun 21, 2021, 7:47 PM IST

Updated : Jun 21, 2021, 8:12 PM IST

ఎన్సీపీ అధినేత శరద్ పవార్​.. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​తో 10రోజుల వ్యవధిలోనే రెండోసారి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్​గా మారింది. జాతీయ స్థాయిలో సరికొత్త రాజకీయాకీయాలకు ఇది ఆరంభమా అనే చర్చ మొదలైంది. వీరి భేటీలో ఏ విషయం గురించి చర్చ జరిగి ఉంటుందా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దిల్లీలోని పవార్ నివాసంలో సోమవారం జరిగిన ఈ సమావేశం.. దాదాపు గంటన్నర పాటు సాగింది. వచ్చే ఏడాది ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, 2024లో లోక్​సభ ఎన్నికలకు సన్నద్ధతపైనే ప్రధానంగా చర్చ జరగి ఉండవచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నట్లూ అనుమానిస్తున్నారు.

మరోవైపు దిల్లీలోని పవార్​ నివాసంలోనే రాష్ట్ర మంచ్ సమావేశం మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ప్రధాని మోదీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా టీఎంసీ ఉపాధ్యక్షుడు యశ్వంత్​ సిన్హా రాష్ట్ర మంచ్​ను 2018లో ఏర్పాటు చేశారు. ఇది రాజకీయ వేదిక కాదు. దేశంలో రాజకీయ, సామాజిక ఆర్థిక పరిస్థితులపై చర్చిస్తారు. ఈ సమావేశానికి పవార్ తొలిసారి హాజరవుతున్నారు. ప్రతిపక్షాల నుంచి కీలక నేతలు కూడా ఇందులో పాల్గొంటారని భావిస్తున్నారు.

పవార్ కీలకం

కేంద్రంలో భాజపాకు వ్యతిరేక కూటమి ఏర్పాటులో పవారే కీలక నేతగా భావిస్తున్నారు. 2024 లోక్​సభ ఎన్నికల్లో ఎన్డీఏకు దీటుగా బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. తన వ్యూహాలతో బంగాల్​లో టీఎంసీకి తిరుగులేని విజయాన్ని అందించిన ప్రశాంత్ కిశోర్​తో పవార్ రెండు సార్లు భేటీ కావడం మరింత ఆసక్తికరంగా మారింది. బంగాల్ గాలిని దేశవ్యాప్తంగా వీచేలా చేసేందుకు వీరివురూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. జూన్​ 11న వీరిద్దరూ తొలిసారి భేటీ అయ్యారు.

ప్రశాంత్​ కిశోర్​తో పవార్ భేటీపై ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ స్పందించారు. ప్రతిపక్ష నాయకులందరినీ ఏకం చేసే దిశగా పవార్​ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.

రాష్ట్ర మంచ్​ సమావేశానికి పవార్, యశ్వంత్​ పాటు ప్రతిపక్షాల నాయకులు, రాజకీయేతర వ్యక్తులు కూడా హాజరవుతారు. కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే మంగళవారం జరిగే భేటీకీ శత్రుఘన్ సిన్హా, మనీశ్ తివారీ హాజరు కావడం లేదు. వ్యక్తిగత కారణాల వల్లే వారు రాలేకపోతున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: 'ఎన్నికల వల్లే ఈ స్థాయికి ఎదిగారా?'

Last Updated : Jun 21, 2021, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details