ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని ఏడాదిపాటు కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తుంది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కమిటీలో సభ్యులు
ఈ ఉన్నత స్థాయి కమిటీలో నిపుణులు, చరిత్రకారులు, రచయితలు, నేతాజీ కుటుంబ సభ్యులు, ఆజాద్ హింద్ ఫౌజ్తో సంబంధం ఉన్న ప్రముఖ వ్యక్తులు ఉంటారు. దిల్లీ, కోల్కత్తా సహా నేతాజీకి సంబంధమున్న ఇతర ప్రాంతాల్లో స్మారకోత్సవ కార్యక్రమాలకు ఈ కమిటీ మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఈ కమిటీ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.