తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జియో సేవలకు అంతరాయం  ​- వినియోగదారుల ఇబ్బందులు!

Jio Network: నెట్​వర్క్​ సమస్యతో రిలయన్స్​ జియో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. నెట్​వర్క్​ డౌన్​తో ముంబయిలోని పలు చోట్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు.. కాల్స్​, మెసేజ్​లు కూడా పంపించుకోలేకపోయారు.

By

Published : Feb 5, 2022, 3:57 PM IST

Updated : Feb 5, 2022, 4:26 PM IST

Jio Network down
Jio Network down

Jio Network: ముంబయిలోని రిలయన్స్​ జియో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల నెట్​వర్క్​కు అంతరాయం ఏర్పడినట్లు.. యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

కాల్స్​, మెసేజ్​లు కూడా సెండ్​ కావట్లేదని మొర పెట్టుకున్నారు. ఇంటర్నెట్​ సర్వీసుల్లోనూ అవాంతరాలు వచ్చినట్లు చెప్పారు.

ముఖ్యంగా ముంబయి సబ్​అర్బన్​, కల్యాణ్​, డోంబివలీ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా తలెత్తినట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి నెట్​వర్క్​ ఇష్యూలు ఉన్నాయని సమాచారం. కొన్ని చోట్ల ఎయిర్​టెల్​ నెట్​వర్క్​ కూడా డౌన్​ అయిందని చెప్పారు.

జియోలో నెట్​వర్క్​ సమస్యపై సంస్థ అధికారి ఒకరు స్పందించారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని అంగీకరించారు. ప్రస్తుతం సేవలను పునరుద్ధరించేందుకు ముమ్మర చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

అయితే ముంబయి మొత్తం సమస్య ఉందా? కొన్ని చోట్లకే పరిమితమైందా అనేది తెలియాల్సి ఉంది.

ఇవీ చూడండి: LIC market Value: ఎల్​ఐసీ రికార్డులు తిరగరాస్తుందా?

కృత్రిమ మేధపై జియో నజర్- రూ.112 కోట్లతో స్టార్టప్​లో వాటా

Last Updated : Feb 5, 2022, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details