తెలంగాణ

telangana

By

Published : Jan 2, 2022, 1:55 PM IST

Updated : Jan 2, 2022, 2:35 PM IST

ETV Bharat / bharat

అమ్మకే అమ్మ అయిన ఏడేళ్ల చిన్నారి

Daughter taking care mother: అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి ఓ చిన్నారి తల్లిలా మారింది. ఆస్పత్రిలో ఉన్న ఆమెకు ఆ చిన్నారి అన్నీ తానే సేవలు చేస్తోంది. మరోవైపు... తన తమ్ముడి బాగోగులను చూసుకుంటోంది. ఇంతటి బాధ్యతల మధ్యే పాఠశాలకు వెళ్లి చదువుకుంటోంది.

Daughter taking care mothe
అమ్మకు అమ్మలా మారి సేవ చేస్తున్న ఏడేళ్ల చిన్నారి

అమ్మకే అమ్మ అయిన ఏడేళ్ల చిన్నారి

Daughter taking care mother: ఏడేళ్ల చిన్నారి.. వయసుకు మించిన బాధ్యతలను భుజానకెత్తుకుంది. తన బాగోగులు తానే చూసుకోలేని వయసులో అనారోగ్యంతో ఉన్న తల్లికి సపర్యలు చేస్తోంది. తమ్ముడినీ చూసుకుంటోంది. అమ్మకే అమ్మ అయిన ఆ చిన్నారిని చూసిన వారి మనుసులు బాధతో బరువెక్కుతున్నాయి.

Woman with spinal cord problem in up: ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాకు చెందిన కేలాదేవీ.. గత కొన్నిరోజులుగా వెన్నెముక సంబంధిత సమస్యతో బాధపడుతోంది. ఫలితంగా ఆమె తరుచూ అనారోగ్యానికి గురయ్యేది. దీంతో.. భర్త, కుటుంబం ఆమెను వదిలేసింది. ఈ పరిస్థితుల్లో.. ఇళ్లల్లో పని చేస్తూ తన ఇద్దరు పిల్లలను కేలాదేవీ పోషించుకునేది. ఆ తర్వాత.. కొన్నాళ్లపాటు పొగాకు ఉత్పత్తులు అమ్ముతూ జీవితాన్ని నెట్టుకొచ్చింది. అయితే.. ఇటీవల ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించసాగింది. దీంతో ఆగ్రాలోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స కోసం చేరింది.

ఆస్పత్రిలో తన తల్లి వద్ద ప్రీతా
తల్లికి అన్నం తినిపిస్తున్న ప్రీతా
ఆస్పత్రిలోనే హోం వర్క్ చేస్తున్న చిన్నారి

Daughter as mother: ఆస్పత్రిలో వైద్యులు ఆమె వెన్నెముకకు శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. అందుకయ్యే ఖర్చును భరించే స్థోమత ఆమెకు లేదు. దాంతో అదే ఆస్పత్రిలో కొద్దిరోజులుగా ఉంటోంది. ఈ క్రమంలో తన ఏడేళ్ల కుమార్తె ప్రీతా ప్రజాపతి... అన్నీ తానై కేలాదేవికి సేవలు చేస్తోంది. అన్నం తినిపించడం మెదలుకొని.. ఇతర అవసరాలన్నీ తీరుస్తోంది. అంతేకాదు.. ఒకటో తరగితి చదివే తన తమ్ముడు సత్యం కుమార్​ బాగోగులూ తనే చూసుకుంటోంది. ఓ వైపు తల్లిని, తమ్ముడిని చూసుకుంటూ, ఇంటిపనులు చేస్తూ... పాఠశాలకు వెళ్తోంది. ఖాళీ దొరికిన సమయాల్లో హోంవర్క్​ చేస్తోంది.

చిన్నారి ప్రీతా ప్రజాపతి
కేలాదేవీ
సత్యం

ప్రీతా ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతోంది. అయితే... తాను భవిష్యత్తులో వైద్యురాలిని అవుతానని చెబుతోంది. అప్పుడు తన తల్లికి మెరుగైన చికిత్స అందిస్తానని అంటోంది.

"నేను పాఠశాలకు వెళ్లి వస్తాను. ఇంటి పనులు చేస్తాను. నా తమ్ముడికి అన్నం తినిపిస్తాను. సమయం దొరికినప్పుడు హోం వర్క్ చేస్తాను. నేను పెద్దయ్యాక బాగా చదివి డాక్టర్ అవుతాను. ఎందుకంటే.. మా అమ్మ అనారోగ్యంగా ఉంది కాబట్టి నేను డాక్టర్ అయ్యి ఆమెకు మంచి వైద్యం అందిస్తాను. "

-ప్రీతా ప్రజాపతి, కేలాదేవీ కుమార్తె

కేలాదేవీ ప్రస్తుతం ఆపన్నుల హస్తం కోసం ఎదురుచూస్తోంది. తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా.. తన పిల్లలను బాగా చదివించడమే తన ఏకైక కల అని ఆమె రోదిస్తోంది.

ఇదీ చూడండి:వెయ్యేళ్ల నాటి శివలింగం స్వాధీనం- విలువ రూ.500 కోట్లు!

ఇదీ చూడండి:మద్యం వద్దు.. పాలు ముద్దు.. రావణుని న్యూ ఇయర్​ సందేశం!

Last Updated : Jan 2, 2022, 2:35 PM IST

ABOUT THE AUTHOR

...view details