తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీఎమ్​సీ ఎమ్మెల్యే హత్య కుట్రదారుగా ముకుల్‌రాయ్‌! - TMC MLA murder case latest news

బంగాల్​లో తృణమూల్ కాంగ్రెస్​ ఎమ్మెల్యే సత్యజిత్​ బిస్వాస్​ హత్య కేసులో భాజపా నేత ముకుల్​ రాయ్​ పేరు నమోదు చేసింది సీఐడీ. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎమ్మెల్యే హత్యకు ప్రధాన కుట్రదారు ముకుల్‌రాయ్‌ అని ఛార్జిషీట్‌లో పేర్కొంది.

Senior BJP leader Mukul Roy has been named as the accused in the murder case of ruling Trinamool Congress MLA Satyajit Biswas
తృణమూల్‌ ఎమ్మెల్యే హత్య కుట్రదారుగా ముకుల్‌రాయ్‌!

By

Published : Dec 6, 2020, 6:41 AM IST

బంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సత్యజిత్‌ బిస్వాస్‌ హత్య కేసు నిందితుడిగా భాజపా సీనియర్‌ నేత ముకుల్‌ రాయ్‌ పేరు నమోదైంది. ఈ మేరకు సీఐడీ శనివారం స్థానిక కోర్టులో అనుబంధ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎమ్మెల్యే హత్యకు ప్రధాన కుట్రదారు ముకుల్‌రాయ్‌ అని అందులో పేర్కొంది.

ఈ విషయంపై భాజపా మండిపడింది. సీఐడీ చర్య వెనుక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుట్ర ఉందని భాజపా అధికార ప్రతినిధి కైలాశ్‌ విజయ్‌వర్గియా ఆరోపించారు. రాజకీయాల్లో హింసను తానెప్పుడూ ప్రోత్సహించలేదంటూ ముకుల్‌రాయ్‌ స్పందించారు. బంగాల్‌లో ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ప్రయత్నమే కనిపిస్తోందన్నారు.

ఇదీ చూడండి:పట్టు వీడని రైతన్న- 11వ రోజుకు చేరిన ఆందోళనలు

ABOUT THE AUTHOR

...view details