కర్ణాటక చామరాజనగర్లో అతిథుల మధ్య కోలాహలంగా జరిగిన ఇద్దర మహిళల సీమంత కార్యక్రమం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే వారిద్దరూ లైంగిక దాడికి గురయ్యారు. అయితేనేం అటువంటి వారిని చేరదీసి సంప్రదాయబద్దంగా జరగాల్సిన కార్యక్రమాన్ని జరిపించింది స్పందన స్వధార కేంద్రం.
స్పందన స్వధార కేంద్రం.. ఓ వరం..
దివ్యాంగురాలైన ఒక మహిళ, 17 ఏళ్ల మరో యువతి స్పందన స్వధార కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారు. వీరిద్దరూ ఏడు నెలల గర్భిణీలు. దివ్యాంగురాలైన మహిళ.. ఇంటి యజమాని చేతిలో లైంగిక దాడికి గురవ్వగా.. 17ఏళ్ల బాలిక చిన్నతనంలోనే ప్రియుడి చేతిలో మోసపోయింది. లైంగిక హింసకు గురై, ఆదరణ కరవైన ఎందరో మహిళలను చేరదీసి.. జీవితంపై భరోసా కల్పిస్తోంది స్పందన స్వధార కేంద్రం. గుండెల్ని మెలిపెట్టే బాధలో ఉన్న వారికి సరికొత్త జీవితాన్ని అందిస్తోంది.