Seema Haider Latest News : పబ్జీ గేమ్లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్ నుంచి భారత్లోకి అక్రమ మార్గంలో అడుగుపెట్టిన సీమా హైదర్ బంఫర్ ఆఫర్ కొట్టేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ దక్కించుకుంది! సీమాకు టికెట్ ఇస్తామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అఠావలే) ప్రకటించింది. ఈ ఆఫర్ను సీమ అంగీకరించినట్లు తెలిసింది. ఈ మేరకు రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్షుడు మఖన్ కిషోర్ ఓ వీడియో విడుదల చేశారు. సెక్యూరిటీ ఏజెన్సీలు సీమ హైదర్కు క్లీన్ చిట్ ఇస్తే.. పార్టీలోకి ఆమెను స్వాగతించేందుకు సమస్యలేం లేవని కిషోర్ అన్నారు. సీమ అద్భుతమైన వక్త అని.. ఆమెకు తమ పార్టీలో అధికార ప్రతినిధి పదవి కూడా ఇవ్వవచ్చు అని కిషోర్ అన్నారు. కాగా, ఆర్పీఐ జాతీయ అధ్యక్షుడు రాందాస్ అఠావలే.. మోదీ ప్రభుత్వంలో రెండోసారి కేబినెట్ మంత్రిగా ఉన్నారు.
'సీమ కేసును.. పోలీసులు, కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఒకవేళ ఆమెకు క్లీన్ చిట్ ఇస్తే.. మా పార్టీలోకి చేర్చుకోవాలని కోరుకుంటున్నా. ఆమె కావాలనుకుంటే 2024 ఎన్నికల్లో మా పార్టీ నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ ఇస్తాం'
-- మఖన్ కిషోర్, రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్షుడు