తమిళనాడులోని తిరుచిరాపల్లి విమానాశ్రయంలో బాంబు వార్త సోమవారం కలకలం రేపింది. దీంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. విమానాశ్రయంలో బాంబు ఉన్నట్టు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఓ బెదిరింపు కాల్ రావడం వల్ల.. ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అనంతరం.. చెన్నై విమానాశ్రయంలోనూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఆ విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం- కారణమదే? - చెన్నై విమానాశ్రయం వార్తలు
బెదిరింపు ఫోన్కాల్తో తమిళనాడులోని తిరుచిరాపల్లి, చెన్నై విమానాశ్రయాల్లో భద్రతను మరింత పెంచారు అధికారులు. తిరుచిరాపల్లి విమానాశ్రయంలో బాంబు ఉన్నట్టు కాల్ రాగా.. దాన్ని వెతికే క్రమంలో తక్షణమే ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు.
![ఆ విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం- కారణమదే? Security stepped up at Tiruchirappally, Chennai airports after threat call](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10457896-thumbnail-3x2-chennai.jpg)
ఆ విమానాశ్రయాలలో భద్రత కట్టుదిట్టం- కారణమదే?
అప్రమత్తమైన అధికారులు.. విమానాశ్రయంలోని 200 మంది ప్రయాణికులను అక్కడి నుంచి తరలించారు. ప్రాంగణ ప్రాంతంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది(సీఐఎస్ఎఫ్), పోలీసుల బృందంతో పాటు స్నైఫర్ డాగ్స్, మెటల్ డిటెక్టర్లు భద్రతా చర్యలు చేపట్టాయి.