బంగాల్లో కాంగ్రెస్-ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎల్)-వామపక్షాల కూటమి మధ్య సీట్ల పంపకం ఎట్టకేలకు తేలిపోయింది. మూడు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 165 స్థానాల్లో వామపక్షాలు, 92 స్థానాల్లో కాంగ్రెస్, 37 స్థానాల్లో ఐఎస్ఎల్ పోటీకి దిగనున్నాయి.
వామపక్ష కూటమికి కేటాయించిన 165 స్థానాల్లో సీపీఎం 130 సీట్లలో బరిలోకి దిగనుంది. తొమ్మిది స్థానాల్లో సీపీఐ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ 15, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 11 స్థానాల నుంచి పోటీ చేయనుంది. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మార్చి 8న ప్రకటించనుంది.