కరోనా కారణంగా గతేడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసు ప్రాథమిక పరీక్షకు హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ వాదనలు విననుంది. న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ కృష్ణ మురళిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించనుంది.
చివరి ప్రయత్నంలో పరీక్ష రాయలేకపోయినవారికి మరో అవకాశం ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా లేనందున సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయంపై ప్రాధాన్యం ఏర్పడింది.