బంగాల్లో 8 దశల్లో పోలింగ్ నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్(ఈసీ) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయమై సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని వ్యాజ్యం వేసిన న్యాయవాది ఎంఎల్ శర్మకు సూచించింది.
అయితే.. నోటిఫికేషన్ జారీ అయ్యాక హైకోర్టుకు వెళ్లలేమని పిటిషనర్ వాదించగా.. దీంతో ఏకీభవించలేమంటూ పిటిషన్ను కొట్టివేసింది అత్యున్నత న్యాయస్థానం.
భాజపా అభ్యర్థికి ఊరట
బంగాల్ ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో హింసకు సంబంధించిన కేసులో ఆమెపై దాఖలైన నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్పై శాసనసభ ఎన్నికలు ముగిసేవరకు స్టే విధించింది.
డెర్బా నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థి హుమాయున్ కబీర్పై భారతి పోటీ చేస్తున్నారు. టీఎంసీకి రాజీనామా చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేసుల పేరుతో వేధిస్తోందని, 2019 ఎన్నికల్లో హింస కేసు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు భారతి. ఎన్నికలు ముగిసేవరకు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని పోలీసులను ఆదేశించిన న్యాయస్థానం... రెండు నెలల తర్వాత పూర్తి స్థాయి విచారణ చేపడతామని తెలిపింది.
ఇదీ చదవండి:మిథున్ 'చక్రం'.. భాజపా కొత్త అస్త్రం!