తెలంగాణ

telangana

By

Published : Feb 10, 2021, 1:09 PM IST

ETV Bharat / bharat

ఐఎన్​ఎస్​ విరాట్​ విచ్ఛిన్నంపై సుప్రీం స్టే

ఐఎన్​ఎస్​ విరాట్​ విమాన వాహక నౌకను తుక్కుగా మార్చాలన్న కేంద్రం నిర్ణయంపై స్టే విధించింది సుప్రీం కోర్టు. మ్యూజియంగా మార్చాలని దాఖలైన పిటిషన్​పై అభిప్రాయం చెప్పాలని నోటీసులు జారీ చేసింది.

INS Viraat
'ఐఎన్​ఎస్​-విరాట్​' ధ్వంసంపై సుప్రీం స్టే

భారత నౌకాదళంలో మూడు దశాబ్దాలకుపైగా సేవలందించిన ఐఎన్​ఎస్​ విరాట్​ విమాన వాహక నౌకను తుక్కుగా మార్చాలన్న కేంద్రం నిర్ణయంపై స్టే విధించింది సుప్రీం కోర్టు. యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది.

విరాట్​ నౌకను.. తుక్కుగా మార్చటానికి బదులుగా మ్యూజియంగా మార్చాలని ఓ సంస్థ దాఖలు చేసిన పిటిషన్​పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డె నేతృత్వంలోని ధర్మాసం విచారణ చేపట్టింది. అభిప్రాయం చెప్పాలని ఆదేశిస్తూ కేంద్రంతో పాటు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.

బ్రిటన్​ నుంచి భారత్​కు

విరాట్‌ నౌక జీవిత కాలం పూర్తయ్యింది. దీంతో 2017 మార్చిలోనే నౌకాదళం నుంచి దీనిని ఉపసంహరించారు అధికారులు. అప్పటి నుంచి ముంబయి తీరంలో ఉంది. మొదట దీనిని మ్యూజియంగా కానీ రెస్టారెంట్‌గా గానీ మార్చేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ ప్రణాళికలు ఫలించలేదు. దీంతో తుక్కుగా మార్చి, విక్రయించేందుకు నిర్ణయించారు.

ఐఎన్‌ఎస్‌ విరాట్‌ తొలుత బ్రిటన్ కు చెందిన రాయల్‌ నేవీలో హెచ్‌ఎంఎస్‌ హెర్మిస్‌గా సేవలందించింది. అనంతరం భారత నావిక దళంలోని ప్రవేశించి 30 ఏళ్ల పాటు సేవలందించింది.

ఇదీ చూడండి:30 ఏళ్లపాటు సేవలందించిన నౌక ఆఖరి యాత్ర

ABOUT THE AUTHOR

...view details