1975 ఎమర్జెన్సీ "పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం" అని ప్రకటించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై స్పందించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 94ఏళ్ల వృద్ధురాలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎమర్జెన్సీ విధించిన 45ఏళ్ల తర్వాత దాని చెల్లుబాటుపై విచారణ చేపట్టడం అవసరమా? అసలు సాధ్యమేనా? అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తామని స్పష్టం చేసింది ధర్మాసనం. అయితే ఎమర్జెన్సీ వంటి పరిస్థితులు అసలు వచ్చి ఉండకూడదని అభిప్రాయపడింది.