తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సివిల్'​ పరీక్షలు: కేంద్రం తీరుపై సుప్రీం అసహనం

యూపీఎస్సీ సివిల్​ సర్వీస్​ పరీక్షలు రాయలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించకపోడంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏ స్థాయి వారు తీసుకున్నారో అఫిడవిట్​లో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించింది.

By

Published : Jan 28, 2021, 10:30 PM IST

SC expresses displeasure over Centre's affidavit in civil services exam matter
కేంద్రం తీరుపై సుప్రీం అసహనం

గతేడాది జరిగిన యూపీఎస్​సీ సివిల్​ సర్వీస్​ పరీక్షలు రాయలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించాలని దాఖలైన పిటిషిన్​పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్​ను తప్పుపట్టింది. ఉద్యోగార్థులకు మరో అవకాశం కల్పించకపోవడానికి గల కారణాలు, ఆ నిర్ణయం ఎవరి స్థాయిలో తీసుకున్నారో అనే సమాచారాన్ని అఫిడవిట్​లో ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించింది. ఈ విషయంలో కేంద్రం తీరుపై జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఎంతో మందిపై ప్రభావం చూపే ఈ నిర్ణయం ఏ స్థాయి వ్యక్తులు తీసుకున్నారో చెప్పలేదని పేర్కొంది. దీనిపై తీర్పును శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

కరోనా కారణంగా సివిల్​ సర్వీస్​ పరీక్షలకు హాజరుకాలేకపోయినా వారికి మరో ఆవకాశం ఇవ్వాలని ఆశావహులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. దీనిపై అఫిడవిట్​ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు పంపంది. ఈ క్రమంలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం ఆశావహులకు మరో అవకాశం కల్పించడం ద్వారా ముందు రాసిన వారికి అన్యాయం జరుగుతుందని వివరించింది. ఇలా చేయడం వ్యవస్థ పని తీరుకు హనికరమని తెలిపింది. ఈ నిర్ణయం ఏ స్థాయి వారు తీసుకున్నారు అనే విషయం తెలియజేయడం లో నిర్లక్ష్యం వహించిందని న్యాయస్థానం పేర్కొంది.

ఇదీ చూడండి: 'హింసను ప్రేరేపించే వార్తా ప్రసారాలపై చర్యలేవి?'

ABOUT THE AUTHOR

...view details