తెలంగాణ

telangana

By

Published : Jan 19, 2022, 11:50 AM IST

ETV Bharat / bharat

కొవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యం.. ఏపీ సీఎస్​కు 'సుప్రీం' సమన్లు

SC Covid ex gratia: కరోనా పరిహారం చెల్లించడంలో ఆలస్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు సమన్లు జారీ చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు తమ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది.

SC COVID ex gratia compensation
SC COVID ex gratia compensation

SC Covid ex gratia: కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. పరిహారం చెల్లించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు సమన్లు జారీ చేసింది.

Covid ex gratia Andhra Pradesh

తమ ముందు హాజరుకావాలని జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఆదేశించింది. మ.2 గం.కు వర్చువల్ మాధ్యమంలో విచారణ జరపనున్నట్లు నిర్ణయించింది. ఈ సందర్భంగా.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇదీ చదవండి:దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details