మాజీ సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు సహా వ్యాజ్యాల కేటాయింపు ఆరోపణల వెనక కుట్రకోణం ఉందా? అనే విషయంపై చేపట్టిన సుమోటో కేసును సుప్రీంకోర్టు మూసివేసింది. రెండేళ్లు దాటినప్పటికీ సరైన ఆధారాలు లభించలేదని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వాట్సాప్ మెసేజ్లు కానీ ఇతర ఎలక్ట్రానిక్ రికార్డులు కానీ లభించలేదని, కాబట్టి సుమోటోను ఇంకా కొనసాగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా.. లైంగిక వేధింపుల ఆరోపణలపై జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ప్యానెల్ ఇదివరకే దర్యాప్తు చేసి, జస్టిస్ గొగొయిని నిర్దోషిగా తేల్చిందని ధర్మాసనం గుర్తు చేసింది.