కరోనా టీకాల కోసం రాష్ట్రాలు.. గ్లోబల్ టెండర్లపై దృష్టి సారించిన నేపథ్యంలో.. ఇది ప్రభుత్వ విధానమా అని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. కరోనా రోగులకు అత్యవసర ఔషధాలు సరఫరాపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ ఎల్ నాగేశ్వర్రావుతో కూడిన ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది.
వారికి ఇబ్బందులు..
టీకా తీసుకోవాల్సిన వారు.. కొవిన్ యాప్లో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలన్న ప్రభుత్వ నిబంధనలను సుప్రీం ప్రశ్నించింది. టీకా నమోదు ప్రక్రియలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడొచ్చని పేర్కొంది. టీకా నమోదు విధానాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించి.. ప్రజలకు అనుగుణంగా మార్చాలని సూచించింది.