తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నారదా కేసు: అప్పీల్​ ఉపసంహరణకు సుప్రీం అనుమతి - నారదా కేసుపై సీబీఐ అప్పీల్​

నారదా కేసులో కలకత్తా హైకోర్టు ఆదేశాలపై అప్పీల్​ను వెనక్కి తీసుకునేందుకు సీబీఐకి అనుమతించింది సుప్రీం కోర్టు. హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. బంగాల్​ ప్రభుత్వం, నిందితులు తమ వాదనలు వినిపించేందుకు స్వేచ్ఛ ఉందని తెలిపింది.

CBI, Supreme court
సీబీఐ, సుప్రీం కోర్టు

By

Published : May 25, 2021, 5:12 PM IST

నారదా కేసులో కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్​ చేసిన అప్పీల్​ను ఉపసంహరించుకునేందుకు సీబీఐకి అనుమతించింది సుప్రీం కోర్టు. హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం.

ఈ కేసులో ముగ్గురు తృణమూల్​ కాంగ్రెస్​ నేతలు సహా మరో నేతను గృహనిర్బంధంలో ఉంచేందుకు కలకత్తా హైకోర్టు ఆదేశాలివ్వటాన్ని సుప్రీం కోర్టులో సవాల్​ చేసింది సీబీఐ.

సీబీఐ అప్పీల్​ను పరిశీలించిన జస్టిస్​ వినీత్​ శరణ్, జస్టిస్​ బీఆర్​ గవాయ్​లు సభ్యులుగా గల సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నారదా కేసులో కలకత్తా హైకోర్టులోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇప్పటికే విచారణ చేపట్టినట్లు స్పష్టం చేసింది. తమ అప్పీల్​ను వెనక్కి తీసుకునేందుకు సీబీఐ తరఫున హాజరైన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతాకు అనుమతించింది. ఎలాంటి సమస్యలున్నా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. బంగాల్​ ప్రభుత్వం, కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు తమ వాదనలు వినిపించేందుకు స్వేచ్ఛ ఉంటుందని తెలిపింది.

నారదా కేసులో విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు, మే 21న ఇద్దరు బంగాల్​ మంత్రులు, ఓ ఎమ్మెల్యే, కోల్​కతా మాజీ మేయర్​లను జైలు నుంచి గృహనిర్బంధంలోకి తరలించాలని ఆదేశించింది. ఈ కేసులో విచారణను వాయిదా వేయలన్న సీబీఐ వినతిని మే 24న తిరస్కరించింది.

ఇదీ చూడండి:నారదా కేసు: సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ

'నారదా స్టింగ్'​ కేసులో టీఎంసీ మంత్రుల అరెస్టు

ABOUT THE AUTHOR

...view details