తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిందువును ముస్లిం అనుకొని ఖననం!

హిందువును ముస్లిం అనుకొని ఖననం చేశారు సౌదీ అధికారులు. అయితే.. ఆ వ్యక్తి అస్థికలను భారత్​కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రం దిల్లీ హైకోర్టుకు తెలిపింది.

By

Published : Apr 16, 2021, 7:17 AM IST

delhi HC, centre to HC
దిల్లీ హైకోర్టు, సౌదీ ప్రభుత్వం

ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఖననం చేసిన హిందూ వ్యక్తి సమాధిని సౌదీ అరేబియా ప్రభుత్వం గుర్తించిందని, మృతుడి అస్థికలను భారత్ రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రం గురువారం దిల్లీ హైకోర్టుకు తెలిపింది.

ఇదీ జరిగింది...

ఈ ఏడాది జనవరి 24న సౌదీలో భారత్​కు చెందిన సంజీవ్ కుమార్(51) గుండెపోటుతో మరణించారు. జెడ్డాలోని భారత దౌత్య కార్యాలయంలోని అనువాదకుడు పొరపాటున మరణ ధ్రువీకరణ పత్రంలో సంజీవ్​ను ముస్లిం వ్యక్తిగా పేర్కొనడంతో అక్కడి అధికారులు ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఖననం చేశారు. విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన భారత దౌత్యాధికారులు మృతుడి భార్య అంజూ శర్మకు విషయాన్ని వివరించి క్షమాపణ కోరారు. ఆ సమయంలోనే తన భర్త అస్థికలను భారత్​కు పంపాలని ఆమె అధికారులను కోరారు. వారు స్పందించకపోవడంతో ఆమె మార్చిలో దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సమాధిని గుర్తించామని, అస్థికల కోసం సౌదీలో చట్టపరమైన చర్యలు ప్రారంభించామని గురువారం భారత విదేశాంగ శాఖ అధికారులు.. న్యాయస్థానానికి తెలిపారు.

ఇదీ చదవండి:విజయన్​పై మురళీధరన్​ ఘాటు వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details