మే 26ను 'బ్లాక్ డే' పాటించాలని పిలుపునిచ్చింది రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా. కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా కర్షకులు చేపట్టిన ఆందోళన 6 నెలలు పూర్తి కావొస్తున్న సందర్భంగా ఈ మేరకు శనివారం ప్రకటించింది.
మే 26న ప్రజలు తమ ఇళ్లు, వాహనాలు, షాపుల్లో నల్ల జెండాలు ఎగురవేయాలని రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం అదే రోజు 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోందని, నిరసనలో భాగంగా ప్రధాని దిష్టిబొమ్మ తగలబెట్టనున్నట్లు రాజేవాల్ చెప్పారు.