ఉత్తర్ప్రదేశ్లోని బస్తీ జిల్లా భేడిహా గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న సూరజ్.. వినూత్న రీతిలో తన ప్రతిభను చాటుకున్నాడు. వ్యర్థాల నుంచి ప్లాస్టిక్ను వేరు చేసి.. దానితో మహాత్మా గాంధీ ప్రతిమను రూపొందించాడు. నిజానికి ఈ ప్రతిమను సూరజ్.. పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆవిష్కరించాల్సి ఉంది. అయితే పెయింట్ పూర్తి కాకపోవడం వల్ల అది సాధ్యం కాలేదు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ ప్రయత్నం అని సూరజ్ పేర్కొన్నాడు.
వ్యర్థాల నుంచి సూరజ్ ప్లాస్టిక్ను వేరు చేసి, పునర్వినియోగ కేంద్రాలకు విక్రయిస్తుంటాడు. అలా వచ్చిన డబ్బును గ్రామ పంచాయతీకి విరాళంగా ఇస్తుంటాడు. ఇలా ఇప్పటివరకు రూ.17వేలు అందించాడు.
అలా సేకరించిన ప్లాస్టిక్కు ఈసారి సిమెంట్, ఇనుము, గోనె సంచుల జోడించి గాంధీ విగ్రహాన్ని రూపొందించాడు సూరజ్.