సంక్రాంతి సీజన్ సందర్భంగా శబరిమల అయ్యప్ప దేవాలయం బుధవారం సాయంత్రం తెరుచుకుంది. అయితే దర్శనానికి మాత్రం గురువారం ఉదయం నుంచి అనుమతిస్తున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది. కొవిడ్-19 దృష్ట్యా కరోనా నెగటివ్ రిపోర్టు ఉన్నవారినే దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేసింది. కొవిడ్ కారణంగా రోజుకు 5వేల మంది భక్తులకు మాత్రమే అవకాశం ఇవ్వనున్నచట్లు అధికారులు తెలిపారు. ప్రయాణానికి 48 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకోవాలని భక్తులకు సూచించారు.
తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం - సంక్రాంతి సీజన్ శబరిమల దేవాలయం
సంక్రాంతి సీజన్ సందర్భంగా శబరిమల ఆలయం బుధవారం సాయంత్రం తెరుచుకుంది. గురువారం ఉదయం నుంచి దర్శనానికి అనుమతిస్తామని దేవస్థానం బోర్డు తెలిపింది. కొవిడ్ నెగటివ్ రిపోర్టు ఉన్నవారినే ఆలయంలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది.

సంక్రాంతి సీజన్ సందర్భంగా తెరుచుకున్న శబరిమల
తెరుచుకున్న శబరిమల
జనవరి 14న మకరవిళక్క(మకర సంక్రాంతి) పండుగ జరగనుంది. జనవరి 20న శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నారు.
ఇదీ చదవండి :శబరిమల యాత్రకు నూతన మార్గదర్శకాలివే!